చికిత్స పొందుతూ మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

చికిత్స పొందుతూ మహిళ మృతి

May 14 2025 2:11 AM | Updated on May 14 2025 2:11 AM

చికిత్స పొందుతూ మహిళ మృతి

చికిత్స పొందుతూ మహిళ మృతి

దండేపల్లి: ఈ నెల 9న గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన మండలంలోని గూడెం గ్రామానికి చెందిన తొడేటి సులోచన (42) చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై తహసినొద్దీన్‌ తెలిపారు. మృతురాలికి కొంతకాలంగా మానసిక స్థితి బాగాలేకపోవడంతో కుటుంబ సభ్యులు పలు ఆస్పత్రుల్లో చూపించారు. అయినా ఆమె ప్రవర్తనలో ఎలాంటి మార్పురాలేదు. నాకు బతకాలని లేదని తరచూ కుటుంబ సభ్యులతో అంటూఉండేది. శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డిమందు తాగి సోదరుడు సత్తయ్యకు ఫోన్‌చేసి చెప్పింది. వెంటనే లక్సెట్టిపేట, అక్కడనుంచి మంచిర్యాలకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు రెఫర్‌ చేయగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందింది. మృతురాలి కుమారుడు సాయిపవన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement