
అంబేడ్కర్ విగ్రహానికి అధ్యాపకుల వినతి
బాసర: ఆర్జీయూకేటీ ఒప్పంద అధ్యాపకుల నిరవధిక సమ్మెలో భాగంగా మంగళవారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీశైలం మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలకు సంబంధించిన జీవో 21 ఉపసంహరించుకోవాలని, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ప్రశాంతి, రజిత, శ్రీకాంత్, విజయకుమార్, ప్రభాకర్రావు, మధుసూదన్, తదితరులు పాల్గొన్నారు.
లారీ ఢీకొని వృద్ధుడు దుర్మరణం
గుడిహత్నూర్: మండలంలోని సీతాగొంది జాతీయ రహదారి 44పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. బోథ్ మండల కేంద్రానికి చెందిన డోంగరి అడెల్లు (70) బోథ్ నుంచి ఆదిలాబాద్కు వెళ్లి తిరుగుప్రయాణంలో వాఘాపూర్ సమీపంలోని లక్ష్మీపూర్లో ఉంటున్న తన కూతురు ఇంటికి వెళ్లడానికి బస్సులో వచ్చి జాతీయ రహదారి దాటుతుండగా గుడిహత్నూర్ నుంచి ఆదిలాబాద్ వైపు అతివేగంతో వెళ్తున్న తమిళనాడుకు చెందిన లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఒకరిపై కత్తితో దాడి
నిర్మల్టౌన్: ఇద్దరు చికెన్ షాపుల నిర్వాహకులు కత్తులతో దాడి చేసుకున్న సంఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. పట్టణానికి చెందిన అబ్దుల్, వజిద్ ఖూరేష్కు స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయం ఎదురుగా చికెన్షాపులు ఉన్నాయి. మంగళవారం వజీర్ తన దుకాణంలో యాసిడ్తో కడుగుతుండగా అబ్దుల్ కళ్లు మండుతున్నాయని, వాసన వస్తుందని చెప్పా డు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరగడంతో వజీర్, గఫర్, షాప్లో పనిచేసే హుస్సేన్ అబ్దుల్పై కత్తితో దాడికి దిగడంతో గాయాలయ్యాయి. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
బాలుడిపై కుక్కలదాడి
కడెం: మండల కేంద్రానికి చెందిన గుంటుకు భూమేశ్ అనే బాలుడిపై ఈ నెల 21న రాత్రి ఊరకుక్కలు దాడి చేయడంతో గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు మండల కేంద్రంలోని పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.