88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌ | - | Sakshi
Sakshi News home page

88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌

Jun 28 2025 8:47 AM | Updated on Jun 28 2025 8:47 AM

88 మం

88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌

పీయూ పరిధిలో 2022–23, 2023–24, 2024–25 విద్యాసంవత్సరానికి సంబంధించి యూనివర్సిటీ టాపర్‌లుగా నిలిచిన విద్యార్థులకు త్వరలో నిర్వహించే 4వ స్నాతకోత్సవ కార్యక్రమంలో గోల్డ్‌మెడల్స్‌ అందించనున్నట్లు పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ప్రవీణ పేర్కొన్నారు. ఇందులో ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌, సోషల్‌ సైన్స్‌, కామర్స్‌లో 21 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌లో 27 మంది, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీలో 14 మంది, ఫ్యాకల్టీ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో 9, యూజీ కోర్సులలో టాపర్స్‌లో 17 మంది గోల్డ్‌మెడల్స్‌ అందించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు గోల్డ్‌మెడల్స్‌ సాధించిన విద్యార్థుల జాబితాను సంబంధిత కళాశాలలకు పంపించామని, వాటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాలుగు రోజుల్లో తెలపవచ్చని పేర్కొన్నారు.

–ప్రవీణ, పీయూ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌

ఘనంగా నిర్వహిస్తాం..

పీయూ 4వ కాన్వకేషన్‌ కార్యక్రమాన్ని సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో నిర్వహించేందుకు పెద్దఎత్తున కసరత్తు చేస్తున్నాం. కార్యక్రమానికి హాజరుకావాలని రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మకు ఆహ్వానం అందించారు. ముఖ్యంగా గోల్డ్‌మెడల్స్‌ ఇచ్చేందుకు స్పాన్సర్లు ముందుకు వస్తే వారి పేరు మీద కూడా అందిస్తాం. ఇందు కోసం రూ.2 లక్షలు డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

– శ్రీనివాస్‌, పీయూ వీసీ

88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌  
1
1/1

88 మంది విద్యార్థులకు గోల్డ్‌మెడల్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement