
టెన్త్ సప్లిమెంటరీలో 80 శాతం ఉత్తీర్ణత
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: ఈ నెల 3వ తేదీ నుంచి 13 వరకు నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,127 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 80.04 శాతంతో 902 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 583 మంది, బాలికలు 319 మంది ఉన్నారు. ఈ ఫలితాలకు సంబంధించి రీకౌంటింగ్ చేయించాలకునే వారు ప్రతి సబ్జెక్ట్కు రూ.500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్ అయితే ప్రతి పేపర్కు రూ.1,00 చొప్పున చెల్లించి... వచ్చే నెల 7వ తేదీలోగా సంబంధిత స్కూల్కు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచించారు.
3న పీయూకు విద్యాకమిషన్ చైర్మన్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి వచ్చేనెల 3వ తేదీన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రానున్నారు. ఈ సందర్భంగా పీయూలో విద్యారంగ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, యూనివర్సిటీల్లో సమస్యలు, సవాళ్లు తదితర వాటిపై ఆరా తీయనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, అధ్యాపకులు, హెచ్ఓడీలు, రిజిస్ట్రార్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ తదితరులతో సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు.