
మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతాం
మహబూబ్నగర్ క్రీడలు: రాష్ట్రంలో క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని మహబూబ్నగర్ను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఎన్.పి వెంకటేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెయిన్ స్టేడియంలో గురువారం రాష్ట్రస్థాయి వాలీబాల్ సెలక్షన్స్ నిర్వహించగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక మంది బాల, బాలికలు పాల్గొన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటేశ్ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. సీఎం రేవంత్రెడ్డి, క్రీడా శాఖ మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వాకిట శ్రీహరి, శాట్ చైర్మన్ శివసేనారెడ్డి జిల్లాకు చెందిన వారేనని, వీరి హయాంలో క్రీడారంగం అభివృద్ధి పథంలో వెళ్లడం ఖాయమన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ డిప్యూటీ డైరెక్టర్ రవీందర్, డీవైఎస్ఓ శ్రీనివాస్, సరూర్నగర్ డీవైఎస్ఓ సెలక్షన్ కమిటీ నామినీ వెంకటేశ్వర్లు, ఎల్బీ స్టేడియం వాలీబాల్ కోచ్ ప్రవీణ, జింఖానా వాలీబాల్ కోచ్ రుషిందర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.