
ఉత్సాహంగా టీజీపీఈ సెట్ ఈవెంట్స్
మహబూబ్నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీలో టీజీపీఈ సెట్–2025 ఈవెంట్స్ రెండో రోజు గురువారం ఉత్సాహంగా కొనసాగాయి. ఈవెంట్స్ను రాష్ట్ర హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వైస్చైర్మన్లు పురుషోత్తం, శ్రీరామ్ వెంకటేశ్తో పాటు పీయూ వీసీ శ్రీనివాస్ పరిశీలించారు. ముందుగా 100 మీటర్ల రన్నింగ్ను వారు గన్ పేల్చి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో వీసీ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మొదటి రోజు ఎంపికలను పూర్తి పాదర్శకంగా నిర్వహించామన్నారు. మిగతా ఈవెంట్స్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రెండో రోజు బీపెడ్లో 544 మందికి గాను 370 మంది, డీపెడ్లో 231 మందికి గాను 145 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో సెట్ కన్వీనర్ దిలీప్, రిజిస్ట్రార్ రమేశ్బాబు, పీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.