లారీ, ఓల్వో బస్సు ఢీ : 18 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

లారీ, ఓల్వో బస్సు ఢీ : 18 మందికి గాయాలు

Jun 13 2025 4:55 AM | Updated on Jun 13 2025 4:55 AM

లారీ, ఓల్వో బస్సు ఢీ : 18 మందికి గాయాలు

లారీ, ఓల్వో బస్సు ఢీ : 18 మందికి గాయాలు

మక్తల్‌: ఆగి ఉన్న లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు వెనుక నుంచి ఢీకొన్న ఘటనలో 18 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని బొందల్‌కుంట స్టేజీ వద్ద గురువారం తెల్లవారుజామున 5.30 గంటలకు చోటు చేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. కర్ణాటకలోని శివమొగ్గ నుంచి 29 మంది ప్రయాణికులతో ఓల్వో బస్సు బుధవారం రాత్రి హైదరాబాద్‌కు బయలుదేరింది. గురువారం తెల్లవారుజామున మండలంలోని బొందల్‌కుంట వద్ద 167 జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బస్సు వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న లక్ష్మణ్‌, నవీన్‌, సంజీవ్‌, అన్నపూర్ణ, షరీఫ్‌, రహీం, మణెమ్మ, శంకర్‌, నర్సింహులు, రమేశ్‌ అనిత తదితరులు మొత్తం 18 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్‌ సంజీవ్‌కు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మక్తల్‌ సీఐ రాంలాల్‌, ఎస్‌ఐ భాగ్యలక్ష్మిరెడ్డి ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను మక్తల్‌, రాయచూర్‌, మహబూబ్‌నగర్‌ ఆస్పత్రులకు తరలించారు. గురువారం ఉదయం ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన

ఎస్పీ యోగేష్‌ గౌతమ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement