
ముగిసిన అంత్యక్రియలు
అడ్డాకుల: మండలంలోని గుడిబండకు చెందిన ముగ్గురు యువకులు బుధవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పట్టణ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం పాఠకులకు విధితమే. కాగా వాస పవన్కుమార్ (26), వాస సాయితేజ (24), వాస రాఘవేంద్ర (22) మృతదేహాలకు శవ పరీక్షల అనంతరం బుధవారం రాత్రి స్వగ్రామానికి తీసుకొచ్చారు. గురువారం ఉదయం దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఒకేరోజు వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు యువకుల అంత్యక్రియలు జరగడంతో గ్రామం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. మృతుల్లో ఇద్దరికి వివాహం కాకపోవడం.. వాస పవన్కుమార్కు భార్య, ఏడాది వయసున్న చిన్నారి ఉన్నారు. ఒక్కగానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతిచెందడంలో తల్లిదండ్రుల రోధనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్పార్టీ మండల అధ్యక్షుడు శ్రీహరి, నాగిరెడ్డి, శెట్టి శేఖర్, విజయమోహన్రెడ్డి, దశరథ్రెడ్డి, శరత్రెడ్డి, చెన్నకేశవులు, శకుంతల, జగదీశ్, భరత్ ఉన్నారు.