విద్యాబోధనపై నిరంతర శోధన చేయాలి | - | Sakshi
Sakshi News home page

విద్యాబోధనపై నిరంతర శోధన చేయాలి

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

విద్యాబోధనపై నిరంతర శోధన చేయాలి

విద్యాబోధనపై నిరంతర శోధన చేయాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యాబోధనపై నిరంతరం పరిశోధనలు చేయాలని హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బాలకిష్టారెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు పీయూలో మారిన నూతన విద్యావిధానం రీసెర్చ్‌ మెథడ్స్‌పై విద్యాకళాశాల అధ్యాపకులు ఏర్పాటు చేసిన వర్క్‌షాప్‌నకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఆవిష్కరణలతో విద్యార్థులకు సులువైన పద్ధతుల్లో బోధించేందుకు అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా విద్యార్థుల్లో పరిశోధన ధృక్పథాన్ని పెంపొందించడంతో ఆలోచనా ధోరణి మారుతుందన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన చేసేందుకు అధ్యాపకులు పాటుపాలని, బోధనలో సమర్థవంతమైన నైతిక విద్యను అందిచేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. పీయూ వీసీ శ్రీనివాస్‌ మాట్లాడుతూ.. పరిశోధన కార్యక్రమాలతో విద్యాప్రమాణాలను గణనీయంగా పెంచుతుందని, వర్క్‌షాప్‌ల నిర్వహణతో అధ్యాపకులు, గణాంకసాధనాలు, డాటా విశ్లేషణ, విద్యారచణ వంటి అంశాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెరుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ రమేశ్‌బాబు, ఐక్యూఏసీ డైరెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, ఆడిట్‌ సెల్‌ డైరెక్టర్‌ చంద్రకిరణ్‌, ప్రిన్సిపాల్‌ కరుణాకర్‌రెడ్డి, ఆంజనేయులు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ బాలకిష్టారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement