ఎట్టకేలకు..! | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు..!

Jun 12 2025 3:37 AM | Updated on Jun 12 2025 3:37 AM

ఎట్టకేలకు..!

ఎట్టకేలకు..!

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఔత్సాహిక వాలీబాల్‌ క్రీ డాకారులను ప్రోత్సహించడానికి 2004లో రాష్ట్ర క్రీ డాపాధికారిక సంస్థ జిల్లాకు వాలీబాల్‌ అకాడమీ మంజూరు చేసింది. అకాడమీ నడిచిన నాలుగేళ్లలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచేవారు. నిధుల నిర్వహణ భారంతో 2008లో వాలీబాల్‌ అకాడమీ ని మూసివేశారు.అప్పట్లో ఈ వాలీబాల్‌ అకాడమీ రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. వా లీబాల్‌ అకాడమీలో శిక్షణ పొందిన జిల్లా క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదిగారు.

మెయిన్‌ స్టేడియంలో ఏర్పాటు

మెయిన్‌ స్టేడియంలో వాలీబాల్‌ అకాడమీని తిరిగి ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ఎప్పటి నుంచో ఉండగా.. మూడేళ్ల కిందట పునఃప్రారంభ మైంది. రూ.19లక్షల70వేలతో వాలీబాల్‌ అకాడమీ ఏర్పాటు చేశారు. స్టేడియం ఆవరణలోని స్విమ్మింగ్‌ పూల్‌లోని పైఅంతస్తుల గదులను అకాడమీ క్రీడాకారుల వసతికి కేటాయించారు. గదుల ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేశారు. స్టేడియంలోని రెండు పాత వాలీబాల్‌ కోర్టులను ఆధునీకరించి వాటి స్థానంలో నూతన కోర్టులు ఏర్పాటు చేశారు. కోర్టుల చుట్టూ నాలుగు ఫ్లడ్‌లైట్లు, ప్రత్యేక షెడ్లు, గ్యాలరీ ఏర్పాటు చేశారు. వాలీబాల్‌ అకాడమీలో ప్రవేశాలు పొందే క్రీడాకారులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశారు. క్రీడాకారులకు సంబంధించి కొంతమేర వసతి సౌకర్యాలు ఇప్పటికే అకాడమీకి చేరాయి. మంచాలు, టేబుల్స్‌, బీరువాలతోపాటు ఇతర వస్తువులు వచ్చాయి. అకాడమీలో ప్రవేశాలు పొందే బాల, బాలికలకు నిష్ణాతులైన కోచ్‌ల పర్యవేక్షణలో వాలీబాల్‌లో మెరుగైన శిక్షణ అందజేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా క్రీడాకారులను తీర్చిదిద్దుతారు.

నేడు, రేపు అకాడమీ ప్రవేశాల సెలక్షన్స్‌

మెయిన్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన నూతన వాలీబాల్‌ అకాడమీలో ప్రవేశాల కోసం 2022 డిసెంబర్‌ 1వ తేదీన రాష్ట్రంలోని బాల, బాలికలకు సెలక్షన్స్‌ నిర్వహించారు. అయితే సెలక్షన్స్‌ జరిగినప్పటికీ క్రీడాకారుల ప్రవేశాలు మాత్రం కల్పించలేదు. ఎట్టకేలకు వాలీబాల్‌ అకాడమీకి ముందడుగు పడింది. నేడు, రేపు రాష్ట్రస్థాయి వాలీబాల్‌ సెలక్షన్స్‌ చేపట్టనున్నారు. 14–16ఏళ్ల బాల, బాలికలు ఎంపికలకు అర్హులు.

వాలీబాల్‌ అకాడమీకి కదలికలు

నేడు, రేపు రాష్ట్రస్థాయి సెలక్షన్స్‌

ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

సెలక్షన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేశాం

జిల్లా కేంద్రంలోని మెయిన్‌ స్టేడియంలో నేడు, రేపు జరిగే వాలీబాల్‌ అకాడమీ సెలక్షన్స్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే బాల, బాలికలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా సంబంఽధిత ధృవపత్రాలతో ఉదయం 8 గంటలకు మెయిన్‌ స్టేడియంలో రిపోర్టు చేయాలి.

– శ్రీనివాస్‌, డీవైఎస్‌ఓ, మహబూబ్‌నగర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement