రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

Jun 11 2025 11:40 AM | Updated on Jun 11 2025 11:40 AM

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే

సాక్షి, నాగర్‌కర్నూల్‌: రానున్న రోజుల్లో రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలన చూశామని, వీరి పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. విశ్వగురువుగా మోదీ పాలన ప్రపంచవ్యాప్తం అయిందని, రాష్ట్రంలోనూ బీజేపీ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. నాగర్‌కర్నూల్‌ జిల్లాకేంద్రంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 11 ఏళ్ల మోదీ పాలనలో చేసిన పనులను ప్రజలకు కులంకశంగా వివరించనున్నట్టు తెలిపారు. మోదీ పాలనలో దేశంలోని 21 కోట్ల ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించినట్టు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంకు నివేదికలోనే స్పష్టం చేసిందన్నారు. 11 ఏళ్ల కిందట ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో పదో స్థానంలో ఉన్న భారత్‌ నేడు నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని చెప్పారు. మేక్‌ ఇన్‌ ఇండియా విధానంతో 95 శాతం ఆర్మీ సామగ్రి దేశంలోనే తయారవుతోందని వివరించారు. పహల్గాంలో దాడి చేసిన ఉగ్రమూకలకు సరైన సమయంలో భారత్‌ గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి ఘటనను పాక్‌ ప్రధానే ఒప్పుకున్నా.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరమన్నారు. గత ఏడాదిన్నర పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి తన సొంత జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల్లో తట్టెడు మట్టి కూడా తీయలేదని విమర్శించారు. మాజీ మంత్రి రాములు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి, ఆచారి, భరత్‌ప్రసాద్‌, ప్రమోద్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదు

నాగర్‌కర్నూల్‌లో బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement