కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం | - | Sakshi
Sakshi News home page

కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం

Jun 11 2025 11:40 AM | Updated on Jun 11 2025 11:40 AM

కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం

కార్మికుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటం

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌: కార్మికుల హక్కుల సాధన కోసం ఐఎన్‌టీయూసీ నిరంతరం పోరాటం చేస్తోందని ఆసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డి చంద్రశేఖర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో మంగళవారం ఐఎన్‌టీయూసీ జిల్లా కమిటీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డాక్టర్‌ సంజీవరెడ్డి నాయకత్వంలో ఐఎన్‌టీయూసీ అంచలంచెలుగా ఎదిగి ఈ రోజు పెద్ద సంఘంగా ఏర్పడినట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సెక్టార్లలో, అసంఘటితరంగ సెక్టర్లలో, బ్యాంకింగ్‌, ఎల్‌ఐసీ, పోస్టల్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ రంగాలతోపాటు అనేక ఫ్యాక్టరీలలో అనుబంధ సంఘాలను ఏర్పాటు చేసుకొని బలమైన సంఘంగా మారిందన్నారు. అనంతరం జిల్లా కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా రాములుయాదవ్‌, ఉపాధ్యక్షులుగా కావలి శ్రీనయ్య, దమ్మాయిపల్లి శ్రీనివాసులు, ఎండీ అలీం, రాంనాయక్‌, హాజీ, బలరాం, ప్రధాన కార్యదర్శిగా రాంమోహన్‌, కోశాధికారిగా విజయబాబు, ప్రచార కార్యదర్శిగా శర్వ లింగం, సలహాదారులుగా ఎస్‌.సాయిరెడ్డి, కొండ పురుషోత్తం, సహాయ కార్యదర్శులుగా సాయిబాబా, టి.నర్సింలు, బాబుమియాలను ఎన్నుకున్నారు. అనంతరం ఐఎన్‌టీయూసీకి సంబంధించిన పోస్టర్లను రాష్ట్ర నాయకులు వి.భాస్కర్‌రెడ్డి, బోరింగ్‌ శ్రీనివాసులు, బాలయ్య, పర్వతాజు, లక్ష్మణ్‌తోపాటు జిల్లా నాయకులు ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement