
చోరీలకు పాల్పడిన నిందితుల రిమాండ్
మక్తల్: తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిట్లు నారాయణపేట డీఎస్పీ లింగయ్య పేర్కొన్నారు. సోమవారం మక్తల్లో పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. మక్తల్ మండలంలోని జక్లేర్కు చెందిన సుభమ్ విష్టువర్ధన్రెడ్డి నవంబర్ 11వ తేదీన ఇంటి తాళాలు విరగ్గొట్టి చోరీ చోటుచేసుకున్న ఘటనపై ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్పీ యోగేశ్గౌతమ్ ఆదేశాల మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. సోమవారం నారాయణపేట క్రాసింగ్ వద్ద తనిఖీలు చేపడుతుండగా.. పోలీసులను చూసి పారిపోతున్న ఎండీ గౌస్, హన్మంతును మక్తల్ పోలీసులు పట్టుకొని విచారించారు. కర్ణాటకలోని సింధనూర్కు చెందిన ఎండీ గౌస్, రాయిచూర్లోని దేవదుర్గకు చెందిన హన్మంతుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. వీరు తాళాలు వేసిన ఇండ్లనే టారెట్ చేయడం చేసి చోరీలకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నారు. మహబూబ్నగర్, దేవరకద్ర, మరికల్, మక్తల్లో చోరీలు చేసినట్లు ఒప్పుకొన్నారు. వారినుంచి 5తులాల బంగారం రికవరీ చేశామని, సుమారు రూ.4లక్షల50వేలు ఉంటుందని పేర్కొన్నారు. సోమవారం వీరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. చోరీ కేసుల్లో మక్తల్ సీఐ రాంలాల్, ఎస్సై భాగ్యలక్ష్మిరెడ్డి, కృష్ణ ఎస్సై నవీద్, క్రైమ్ పోలీసులు అశోక్, శ్రీకాంత్, నరేశ్, శశి పనితీరును డీఎస్పీ అభినందించారు. పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు.
5తులాల బంగారం రికవరీ
నారాయణపేట డీఎస్పీ లింగయ్య