జడ్చర్ల టౌన్: పోలీస్స్టేషన్కు ఆనుకుని ఉన్న ఇంట్లో దొంగలు పడి చోరీకి పాల్పడిన సంఘటన ఆదివారం సాయంత్రం వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల పోలీస్స్టేషన్ వెనక వైపు ప్రహరీకి ఆనుకుని నిజాం అనే వ్యక్తికి చెందిన ఇళ్లు ఉంది. బక్రీద్ సందర్భంగా పట్టణంలోని హౌజింగ్బోర్డుకాలనీలో ఉంటున్న తన సోదరుడి ఇంటికి శనివారం వెళ్లారు. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చి చూడగా ఇంట్లో బీరువా తాళం విరగ్గొట్టి ఉండటం, దుస్తులు చిందరవందరగా వేసి ఉండటాన్ని గుర్తించాడు. అందులో ఉన్న 6 తులాల బంగారు నగలు, 30 తులాల వెండి, రూ.40 వేల నగదు చోరీకి గురైందని గుర్తించి.. డయల్ 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై పోలీసులు ఎవరూ స్పందించలేదని తెలిసింది.