
మూగజీవాల ఉసురుతీస్తున్న పిడుగులు
బిజినేపల్లి/ తాడూరు/ చారకొండ: అన్నదాతలకు వ్యవసాయంలో చేదోడువాదోడుగా ఉండే కాడెద్దులు, మూగజీవాలను పిడుగుపాట్లు బలి తీసుకుంటున్నాయి. రూ.వేలు విలువ చేసే కాడెద్దులు అకాల మృత్యువాత పడుతుండటంతో రైతన్నలు తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో ఆదివారం బిజినేపల్లి మండలంలోని వెంకటాపూర్ గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం కాడెద్దులను పొలం వద్ద చెట్టు కింద కట్టేశాడు. అయితే సాయంత్రం వర్షంతోపాటు పిడుగు పడటంతో కాడెద్దులు మృతిచెందాయి. వీటి విలువ రూ.1.50 లక్షలు ఉంటుందని బాధిత రైతు వాపోయాడు. అలాగే తాడూరు మండలంలోని చర్లఇటిక్యాలలోనూ రైతు బ్రహ్మానందరెడ్డికి చెందిన ఎద్దు పిడుగు పడి మృతిచెందింది. చారకొండ మండలంలోని సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రైతు అంజయ్య వ్యవసాయ పొలంలో కట్టేసిన పాడిగేదెలు పిడుగు పడి మృతిచెందాయి. వీటి విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నాడు. బాధిత రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

మూగజీవాల ఉసురుతీస్తున్న పిడుగులు

మూగజీవాల ఉసురుతీస్తున్న పిడుగులు