అతివేగానికి నిండు ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

అతివేగానికి నిండు ప్రాణం బలి

Jun 9 2025 12:56 AM | Updated on Jun 9 2025 12:56 AM

అతివేగానికి నిండు ప్రాణం బలి

అతివేగానికి నిండు ప్రాణం బలి

ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్తకు ఓ నిండు ప్రాణం బలైంది. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. ఎస్‌ఐ యుగంధర్‌రెడ్డి వివరాల మేరకు.. ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు చిత్తూరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో బయలుదేరింది. డ్రైవర్‌ అతివేగం, అజాగ్రత్త కారణంగా పెబ్బేరు మండలం తోమాలపల్లి సమీపంలో బస్సు అదుపుతప్పింది. ఈ క్రమంలో ముందు వెళ్తున్న కర్ణాటకకు చెందిన బస్సును తప్పించబోయి పక్కనే వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. ప్రమాదంలో ట్రావెల్స్‌ బస్సు హెల్పర్‌ నాగేంద్ర ప్రసాద్‌ (19) అనే యువకుడి తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. డ్రైవర్‌ సురేశ్‌తో పాటు ప్రయాణికులు స్వాతి, క్రాంతిలకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న హైవే సిబ్బంది, పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్‌లో వనపర్తి జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సుబ్బారాయుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement