
పిచ్చికుక్క స్వైర విహారం
ఎర్రవల్లి: పిచ్చికుక్క దాడిలో ఆరుగురు గాయపడిన ఘటన మండలంలోని వల్లూరులో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు.. గ్రామంలోని వివిధ కాలనీలకు చెందిన గోపాల్, మద్దమ్మ, మాసుంబీ, గోపి, వెంకటేష్, వేణుగోపాల్ని కరిచింది. గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం కర్నూలు ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మద్దమ్మ, వెంకటేష్ ఇంటికి చేరుకోగా.. మిగిలిన నలుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వారు వివరించారు. ఆరుగురిపై కుక్క దాడి చేసి గాయపర్చినట్లు తమకు సమాచారం వచ్చిందని.. బాధితులు ఇటిక్యాల ఆరోగ్య కేంద్రానికి రాలేదని మండల వైద్యాధికారి డా. రాధిక తెలిపారు. కేంద్రంలో రేబీస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. కుక్క కాటుకు గురైనవారు వచ్చి చికిత్స పొందవచ్చని సూచించారు.
ఆరుగురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

పిచ్చికుక్క స్వైర విహారం