కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు | - | Sakshi
Sakshi News home page

కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు

Jun 7 2025 12:22 AM | Updated on Jun 7 2025 12:22 AM

కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు

కోయిల్‌సాగర్‌కు కృష్ణమ్మ పరుగులు

దేవరకద్ర/ మరికల్‌: జూరాల ప్రాజెక్టుకు వరదలు రావడంతో కృష్ణాజలాలు కోయిల్‌సాగర్‌కు పరుగులు పెడుతున్నాయి. కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం కింద ఉంద్యాల వద్ద ఉన్న ఫేస్‌–1 పంప్‌హౌస్‌ నుంచి ఈ నెల 1న ఒక పంపును రన్‌ చేసి 315 క్యూసెక్కుల నీటిని వదిలారు. ఆ నీటితో ముందుగా పర్దీపూర్‌ రిజర్వాయర్‌ను నింపిన తర్వాత అక్కడి నుంచి తీలేర్‌కు తరలించారు. దీంతో తీలేర్‌ ఫేస్‌–2 వద్ద ఒక పంపును రన్‌ చేసి కోయిల్‌సాగర్‌కు నీటిని వదిలారు. ఈ మేరకు శుక్రవారం తీలేర్‌ పంపుహౌస్‌ వద్ద నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి ఒక మోటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జూరాలకు ఎగువ నుంచి వరద రావడంతో ప్రస్తుతం ఒక పంపు ద్వారా రోజుకు 315 క్యూసెక్కుల నీరు కోయిల్‌సాగర్‌కు చేరుతుందన్నారు. జూరాలకు వరద నీరు అలగే కొనసాగితే మరికల్‌ మండలంలోని చెరువులను నింపేందుకు 150 క్యూసెక్కుల నీటిని లింకు కెనాల్‌కు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు ఒకసారి పూర్తిస్థాయిలో నిండితే రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాంకోటి, ఆర్‌ఐ సుధాకార్‌రెడ్డి, నాయకులు సూర్యమోహన్‌రెడ్డి, వీర న్న, కృష్ణయ్య, హరీష్‌, రామకృష్ణ, రామకృష్ణారెడ్డి, రఘు, హర్షవర్ధన్‌రెడ్డి, నరహరి, శ్రీకాంత్‌రెడ్డి, ఆంజనేయులు, చిన్నబాలు, హన్మంతు పాల్గొన్నారు.

● కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 11 అడుగుల మేర నీటి మట్టం నిల్వ ఉండగా పాత అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు. కాగా గేట్ల స్థాయి వరకు 32.6 అడుగులు రావాల్సి ఉంటుంది. ఎత్తిపోతల పథకం నీటి విడుదల ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు పాత అలుగుకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది.

తీలేర్‌ దగ్గర పంపు ప్రారంభించిన ఎమ్మెల్యే పర్ణికారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement