
వైభవంగా రంగనాథస్వామి కల్యాణం
కందనూలు: జిల్లాకేంద్రం శివారులోని శ్రీపురంలో రంగనాథస్వామి కల్యాణోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం స్వామివారి ఎదుర్కోళ్లు, పల్లకీసేవ, అనంతరం భక్తుల సమక్షంలో రంగనాథస్వామి కల్యాణం కనుల పండువగా జరిపించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తుల గోవింద నామస్మరణతో శ్రీపురం మార్మోగింది. సాయంత్రం మాఢవీధుల్లో రథోత్సవం శోభాయమానంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్రెడ్డి, ఆలయ ధర్మకర్త రంగాచార్యులు, చైర్మన్ రామకృష్ణారెడ్డి, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

వైభవంగా రంగనాథస్వామి కల్యాణం