
చెట్టుపై నుంచి కిందపడి గీత కార్మికుడి మృతి
తాడూరు: తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి చెందిన ఘటన గురువారం నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. సిర్సవాడ గ్రామానికి చెందిన చింతకింది మల్లేష్గౌడ్ రోజులాగానే కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. చెట్టుపైకి పూర్తిగా ఎక్కిన తర్వాత అతని నడుముకు కట్టుకున్న మోపు ఉడిపోవడంతో చెట్టుపై నుంచి కింద పడిపోయాడు. దీంతో వెంటనే అతన్ని జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముఉంది. మృతుడికి భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.
500 గ్రాముల ఆల్బజోలం పట్టివేత
వనపర్తి రూరల్: పెబ్బేరు పట్టణ కేంద్రంలోని మార్కెట్ యార్డులో గురువారం కొందరు వ్యక్తులు ఆల్బజోలం మత్తు పదార్థం విక్రయస్తున్నారని ముందస్తు సమాచారంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ యుగేంధర్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలోని బింగిదొడ్డి గ్రామానికి చెందిన నరసింహాగౌడ్, గట్టు మండలంలోని తుమ్మలపల్లికి చెందిన భాస్కర్గౌడ్ పెబ్బేరు మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఆల్బజోలం విక్రయిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని భాస్కర్గౌడ్, నరసింహాగౌడ్ను అదుపులోకి తీసుకోగా.. మిగిలిన వారు పరారయ్యారు. అదుపులోని తీసుకున్న నరసింహాగౌడ్ను విచారించగా కర్నూల్ జిల్లాకు చెందిన హర్షవర్ధన్గౌడ్, జగదీశ్గౌడ్, గోపాల్గౌడ్ అనే ముగ్గురు వ్యక్తుల నుంచి అల్బజోలం తీసుకొచ్చి భాస్కర్గౌడ్ ఇస్తున్నానని తెలిపాడు. భాస్కర్గౌడ్ కల్లు దుకాణాలకు నడుపుతున్న అనంతపురం జిల్లాకు చెందిన కుమార్గౌడ్, కర్నూల్ జిల్లాకు చెందిన లక్ష్మన్నగౌడ్, పండ్ల రమేష్, గజేంద్రగౌడ్, నాగర్కర్నూల్ చెందిన యుగంధర్గౌడ్లకు విక్రయిస్తున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి 500 గ్రాముల ఆల్బజోలం స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.