మొసలి దర్శనం.. భయాందోళనలో ప్రజలు | - | Sakshi
Sakshi News home page

మొసలి దర్శనం.. భయాందోళనలో ప్రజలు

Jun 6 2025 12:23 AM | Updated on Jun 6 2025 12:23 AM

మొసలి

మొసలి దర్శనం.. భయాందోళనలో ప్రజలు

వీపనగండ్ల: మండల కేంద్రంలోని ఊరు చెరువులో మొసలి కనిపించడంతో స్థానిక రైతులు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు. వారం రోజులుగా తరచూ కనిపిస్తుండడంతో రైతులు, పశువుల కాపరులు అటుగా వెళ్లేందుకు జంకుతున్నారు. అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో బాలుడి ప్రతిభ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: సికింద్రాబాద్‌లోని జింఖానా మైదానంలో ఇటీవలే జరిగిన రాష్ట్రస్థాయి సబ్‌ జూనియర్‌ అథ్లెటిక్స్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుడు ఎం.రిథిన్‌ ప్రతిభ చాటాడు. 8 ఏళ్లలోపు బాలుర విభాగంలో 200 మీటర్ల పరుగును 34.4 సెకన్లలో పూర్తి చేసి కాంస్య పతకం సాధించాడు. ఈ క్రమంలో గురువారం జిల్లా కేంద్రంలో రిథిన్‌ను జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ఉపాధ్యాక్షుడు రాజేంద్రకుమార్‌ శాలువాతో సత్కరించి రూ.1500 నగదు పారితోషికం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అథ్లెటిక్స్‌ సంఘం ప్రధాన కార్యదర్శి జి.శరత్‌చంద్ర, జడ్చర్ల అథ్లెటిక్స్‌ కోచ్‌ ఎం.శ్రీనివాసులు పాల్గొన్నారు.

విద్యుదాఘాతంతోరెండు గేదెలు మృతి

కోయిల్‌కొండ: విద్యుదాఘాతంతో రెండు పాడి గేదెలు మృతిచెందిన ఘటన కోయిల్‌కొండ మండలం కొత్లాబాద్‌లో గురువారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కొత్లాబాద్‌కు చెందిన రైతు దస్తగిరి నర్సింహులు రోజు మాదిరిగానే తన గేదెలను గ్రామ శివారులోని వ్యవసాయ పొలంలో మేపేందుకు తీసుకెళ్లాడు. అక్కడ మేత మేస్తున్న క్రమంలో రెండు గేదెలు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. సమాచారం అందుకున్న వెటర్నరీ డాక్టర్‌ సమీర్‌ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుకున్నారు. రెండు గేదెల విలువ రూ. 2లక్షల వరకు ఉంటుందని.. బాధిత రైతును ప్రభుత్వపరంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

మొసలి దర్శనం..  భయాందోళనలో ప్రజలు 
1
1/2

మొసలి దర్శనం.. భయాందోళనలో ప్రజలు

మొసలి దర్శనం..  భయాందోళనలో ప్రజలు 
2
2/2

మొసలి దర్శనం.. భయాందోళనలో ప్రజలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement