‘బడిబాట’ను విజయవంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

‘బడిబాట’ను విజయవంతం చేద్దాం

Jun 6 2025 12:23 AM | Updated on Jun 6 2025 12:23 AM

‘బడిబాట’ను విజయవంతం చేద్దాం

‘బడిబాట’ను విజయవంతం చేద్దాం

కొత్తకోట: నేటి నుంచి ప్రారంభమయ్యే బడిబాట కార్యక్రమంలో ప్రతి ఉపాధ్యాయుడు పాల్గొని విజయవంతం చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు. గురువారం కొత్తకోట పట్టణ కేంద్రంలోని పీఆర్‌టీయూ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు గతేడాది కంటే ఈ ఏడాది విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 16,80,000 మంది విద్యార్థులు ప్రభుత్వ జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో చదువుతున్నారని, ఒకప్పుడు ఈ సంఖ్య 32లక్షలు ఉండేదని, నేడు గురుకుల పాఠశాలలో చదువుతున్న విద్యార్థులతో కలిపిన కూడా 23 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారన్నారు. ఈ కమ్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బడిబాట కార్యక్రమం నేటి నుంచి ఈనెల 19 వరకు నిర్వహిస్తుండగా, ప్రతి ఉపాధ్యాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలన్నారు. అలాగే మౌళిక సదుపాయాల కల్పన, చాలా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉందని, ఖాళీలను భర్తీ చేసేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించేందుకు పీఆర్‌టీయూ పక్షాన శాసనమండలిలో వినిపిస్తానన్నారు. కార్యక్రమంలో పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు గుండు లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి, పీఆర్‌టీయూ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పేరి వెంకట్‌రెడ్డి, వనపర్తి జిల్లా అధ్యక్షులు మోరెడ్డి బౌద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement