అండర్‌–19 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయభేరీ | - | Sakshi
Sakshi News home page

అండర్‌–19 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయభేరీ

Jun 6 2025 12:23 AM | Updated on Jun 6 2025 12:23 AM

అండర్

అండర్‌–19 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయభేరీ

మహబూబ్‌నగర్‌ క్రీడలు: ఉమ్మడి జిల్లా అండర్‌–19 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. గురువారం జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్‌లో జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్‌ జట్టు 254 పరుగుల తేడాతో నారాయణపేట జట్టుపై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 343 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. జట్టులో ఓపెనర్‌ అబ్దుల్‌రాఫే మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 127 బంతుల్లో 3 సిక్స్‌లు, 25 ఫోర్లతో 165 పరుగులు, ప్రణయ్‌ 52 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నారాయణపేట జట్టు పాలమూరు బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లను కోల్పోయింది. 31.1 ఓవర్లలో 89 పరుగులకు ఆలౌట్‌ అయింది. పాలమూరు బౌలర్‌ కిషోర్‌ 9.1 ఓవర్లలో 36 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీయగా ఇతర బౌలర్లు మనోజ్‌ యాదవ్‌ 2, అభినవ్‌ 2 వికెట్లు తీశారు.

అండర్‌–19 లీగ్‌లో ప్రతిభచాటాలి

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఉమ్మడి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో అండర్‌–19 ఇంట్రా డిస్ట్రిక్ట్‌ క్రికెట్‌ లీగ్‌ నిర్వహిస్తున్నట్లు ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్‌ తెలిపారు. లీగ్‌ మ్యాచ్‌ను గెలిచిన మహబూబ్‌నగర్‌ జట్టును ఆయన అభినందించారు. ఓడినవారు నిరాశ చెందకుండా మళ్లీ గెలుపు కోసం ఆడాలని కోరారు. అండర్‌–19 లీగ్‌లో రాణించే క్రీడాకారులను త్వరలో జరిగే హెచ్‌సీఏ రాష్ట్రస్థాయి టోర్నీలకు ఎంపిక చేస్తామని తెలిపారు. అండర్‌–19 లీగ్‌లో క్రీడాకారులు తమ వ్యక్తిగత ప్రదర్శనను చాటుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎండీసీఏ ఉపాధ్యక్షులు సురేష్‌కుమార్‌, కోచ్‌లు అబ్దుల్లా, మన్నాన్‌ పాల్గొన్నారు.

అండర్‌–19 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయభేరీ 1
1/1

అండర్‌–19 లీగ్‌లో మహబూబ్‌నగర్‌ విజయభేరీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement