
రైతులకు అవగాహన కల్పించాలి
కోయిల్కొండ: భూభారతి ద్వారా గ్రామాల్లో నెలకొన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ విజయేందిరబోయి అన్నారు. బుధవారం కోయిల్కొండ మండలం చంద్రాస్పల్లిలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆమె పాల్గొని, భూసమస్యల దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులందరూ పాల్గొనేలా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రెవెన్యూ సదస్సుల్లో హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసి దరఖాస్తుదారులకు ఏవిధంగా దరఖాస్తు పూరించాలని సూచనలు, సలహాలు అందజేయనున్నట్లు తెలిపారు. అధికారులు స్వీకరించిన దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కారం చేయనున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అదే గ్రామంలో పల్లె దవాఖానాను కలెక్టరతనిఖీ.. వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్తహీనత ఉన్న మహిళలపై ప్రత్యేక శ్రద్ధ చూపి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రాజాగణేష్, తదితరులు ఉన్నారు.