విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలి

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలి

విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలి

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: విద్యార్థులను భావిపౌరులుగా తీర్చిదిద్దాలని డీఈఓ ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని ఏనుగొండ పాఠశాలలో ప్రజ్వల సంస్థ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్‌ను నిర్ణయించే స్థాయికి ఆడపిల్లలు ఎదగాలని, వారి అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. విద్యార్థినీలు బాల్యవివాహాల బారిన పడకుండా పూర్తిస్థాయిలో అప్రమత్తత వ్యవహరించాలని సూచించారు. సైబర్‌ ట్రాఫికింగ్‌ అనేది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని, విద్యార్థులు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలన్నారు. సోషల్‌ మీడియా వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను విద్యార్థులకు వివరించాల్సిన అవసరం ఉందని, పిల్లలకు ఏదైనా ప్రమాదం జరిగితే 1098, 181, 100, 1930 వంటి టోల్‌ ప్రీ నంబర్లు ఉపయోగించుకునేలా సూచించాలన్నారు. కార్యక్రమంలో ఏఎంఓ శ్రీనివాస్‌, జీహెచ్‌ఎం అరుణ్‌కుమార్‌, కోఆర్డినేటర్‌ మల్లేష్‌, మిథాలీరాజ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement