రేపు డిప్యూటీ సీఎం పర్యటన | - | Sakshi
Sakshi News home page

రేపు డిప్యూటీ సీఎం పర్యటన

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

రేపు డిప్యూటీ సీఎం పర్యటన

రేపు డిప్యూటీ సీఎం పర్యటన

అడ్డాకుల: మూసాపేట మండలకేంద్రంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం పర్యటించనున్నారని, దీనిని పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి కోరారు. మూసాపేటలోని అయ్యప్పగుట్ట పక్కన ఏర్పాటు చేయనున్న 132/33కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌తో పాటు అడ్డాకుల, మూసాపేట, భూత్పూర్‌ మండలాల్లోని గ్రామాలకు మంజూరైన 33/11కేవీ విద్యుత్‌ సబ్‌ స్టేషన్లకు కూడా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇక్కడే శంకుస్థాపన చేయన్నుందున వాటికి సంబంఽధించిన ఏర్పాట్లను బుధవారం సాయంత్రం ఆయన పరిశీలించారు. సబ్‌ స్టేషన్‌ స్థలంలో పాటు బహిరంగ సభ ఏర్పాట్లపై విద్యుత్‌ శాఖ అధికారులు, పార్టీ నేతలతో చర్చించారు. డిప్యూటీ సీఎం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలిరావాలని కోరారు. అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రాజునాయక్‌, పార్టీ మండలాధ్యక్షుడు శెట్టిశేఖర్‌, నాగిరెడ్డి, బాలనర్సిములు, బగ్గి కృష్ణయ్య, సుధాకర్‌రెడ్డి, రాంచందర్‌, ఎన్‌టీగౌడ్‌, కృష్ణయ్య, రవి, సుధాకర్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement