జడ్చర్లలో అర్ధరాత్రి కారు బీభత్సం | - | Sakshi
Sakshi News home page

జడ్చర్లలో అర్ధరాత్రి కారు బీభత్సం

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

జడ్చర్లలో అర్ధరాత్రి  కారు బీభత్సం

జడ్చర్లలో అర్ధరాత్రి కారు బీభత్సం

మద్యం మత్తులో డ్రైవర్‌

బెలూన్లు తెరుచుకోవడంతో తప్పిన

ప్రాణాపాయం

జడ్చర్ల: స్థానిక సిగ్నల్‌గడ్డ ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. ఐపీఎల్‌లో ఆర్‌సీబీ జట్టు విజయం సాధించడంతో సంబరాలు చేసుకున్న కొందరు యువకులు మద్యం తాగి కారులో సిగ్నల్‌గడ్డ నుంచి నేతాజీ చౌరస్తా వైపునకు వెళ్తున్న క్రమంలో రాఘవేంద్రస్వామి ఆలయం వద్ద అదుపు తప్పి ఆలయం వైపునకు దూసుకొచ్చింది. రోడ్డు పక్కన ఉన్న చెరుకు రసం యంత్రాన్ని ఢీకొట్టడంతో కారు ముందు భాగంతో పాటు యంత్రం పూర్తిగా ధ్వంసమైంది. అయితే కారులో బెలూన్లు తెరుచుకోవడంతో చర్లపల్లి, కావేరమ్మపేటకు చెందిన నలుగురు యువకులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారని స్థానికులు తెలిపారు. జేసీబీ సహాయంతో కారును అక్కడి నుంచి తరలించారు. అయితే ప్రమాదానికి సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ మల్లేష్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement