ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపిక

Jun 5 2025 7:40 AM | Updated on Jun 5 2025 7:40 AM

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపిక

ఉత్సాహంగా బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్‌ ఇండోర్‌ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాస్థాయి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపికలు నిర్వహించారు. ఈ ఎంపికలకు 100మందికి పైగా క్రీడాకారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు శ్యాంసుందర్‌గౌడ్‌, ఎల్‌.రవికుమార్‌ మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు బ్యాడ్మింటన్‌లో జాతీయ, అంతర్జాతీయస్థాయిల్లో రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం ఎంపికలో ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారికి మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా షటిల్‌ బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి సాదత్‌ఖాన్‌, ఉపాధ్యాక్షుడు శివప్రసాద్‌, ప్రవీణ్‌, సీనియర్‌ క్రీడాకారుడు సయ్యద్‌ పాల్గొన్నారు.

ఎంపికై న క్రీడాకారులు

అండర్‌–13 విభాగం బాల, బాలికలు సింగిల్స్‌లో ఆర్‌.అభిజిత్‌, రోహన్‌ రాఘవ, రిషిక. శ్రీహాస, డబుల్స్‌లో రోహన్‌ రాఘవ–విగ్నేష్‌, శ్రేష్ఠ–హేమలత, అండర్‌–15 విభాగంలో సింగిల్స్‌లో శివశంకర్‌, వినుథన్‌రెడ్డి, టి.రిషిత, వర్షిని, డబుల్స్‌లో ఆర్‌.అభిజిత్‌–వినుథన్‌రెడ్డి, వర్షిని–మీనాక్షి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శివశంకర్‌–వర్షిని, అండర్‌–17లో సింగిల్స్‌లో ఎన్‌జే.జోయల్‌, సంతోష్‌కుమార్‌, రిషితా, సర్వఘ్న, డబుల్స్‌లో భీమ్‌ చరణ్‌–అనిరుధ్‌, అరుణ–మీనాక్షి, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రాఘవేంద్ర–శ్రీనిధి, అండర్‌–19లో సింగిల్స్‌లో ఎన్‌జే.జోయల్‌ ప్రసూన్‌, సంతోష్‌కుమార్‌, శ్రీనిధి, రిషిత, డబుల్స్‌లో ఎన్‌జే. జోయల్‌–సంతోష్‌కుమార్‌, రిషితా–శ్రీనిధి, సీనియర్‌ పురుషుల సింగిల్స్‌లో జీషాన్‌, సుమిత్‌కుమార్‌, మహిళల్లో సైరబాను, వర్ధిని, డబుల్స్‌లో సయ్యద్‌ ఎజాస్‌అలీ–జీషాన్‌, సైరబాను–వర్ధిని, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సయ్యద్‌ అంజద్‌–సైరబాను ఎంపికయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement