
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
హన్వాడ: మండలంలోని వేపూర్లో ఉరేసుకొని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ వెంకటేష్ కథనం మేరకు.. గ్రామానికి చెందిన మాల శిరీష (30)కు భర్త నర్సింలు ఏడు నెలల క్రితం అనారోగ్యంతో మృత్యువాత పడ్డాడు. దీంతో ఒంటరిగా జీవిస్తున్న శిరీష తీవ్ర మనస్తాపానికి గురైంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిరీష ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరిది సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ వెంకటేష్ తెలిపారు.
వ్యక్తి బలవన్మరణం
బల్మూర్: మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరేసుకోని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలంలోని గోదల్లో బుధవారం చోటు చేసుకుంది. ఎస్ఐ రమాదేవి, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గోదల్ గ్రామానికి చెందిన వెంకటయ్య(40) భార్య లలిత ఏడాది క్రితం అతడిని వదిలి పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటుంది. దీంతో మనస్తాపానికి గురైన వెంకటయ్య మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై మృతుడి సోదరుడు చంద్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినటు్ల్ ఎస్ఐ తెలిపారు.
విద్యుత్ షాక్తో
యువకుడి దుర్మరణం
దేవరకద్ర: దేవరకద్ర మండలం వెంకటాయపల్లి గ్రామంలో బుధవా రం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్ఐ నాగన్న కథనం ప్రకారం.. వెంకటాయపల్లికి చెందిన శివమల్లేశ్ (24) బుధవారం ఉదయం బహిర్భూమికి వెళ్లాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగిలి విద్యుత్ షాక్కు గురయ్యాడు. గమనించిన గ్రామస్తులు వెంటనే విద్యుత్ను నిలిపి వేయించారు. అయితే అప్పటికే శివమల్లేశ్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బైక్ పైనుంచి జారిపడి
వృద్ధురాలు మృతి
ఎర్రవల్లి: ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనం పైనుంచి జారిపడి వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ వెంకటేష్ తెలిపిన వివరాలు మేరకు గద్వాల మండలం బీరెల్లికి చెందిన గొల్ల దాయేదమ్మ (65) మంగళవారం వీపనగండ్ల మండలం గోపత్దిన్నెకు దేవర నిమిత్తం వెళ్లింది. బుధవారం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా తిమ్మాపురం వద్ద ఓ గుర్తు తెలియని వ్యక్తి ద్విచక్ర వావానం ఎక్కి ప్రమాదవశాత్తు జారి కిందపడింది. తీవ్రగాయాలు కాగా చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యు లు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలి అల్లుడు గొల్ల బీచుపల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.