
మహబూబ్నగర్కు హ్యాట్రిక్ విజయం
మహబూబ్నగర్ క్రీడలు: ఉమ్మడి జిల్లా అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో మహబూబ్నగర్ జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. జిల్లా కేంద్రానికి సమీపంలోని సమర్థ స్కూల్ మైదానంలో బుధవారం జరిగిన మూడో లీగ్ మ్యాచ్లో మహబూబ్నగర్ జట్టు 170 పరుగుల తేడాతో గద్వాల జట్టుపై గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్నగర్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. జట్టులో ఓపెనర్ అబ్దుల్ రాఫే అద్భుతమైన బ్యాటింగ్తో అజేయ డబుల్ సెంచరీ చేశాడు. 173 బంతుల్లో 6 సిక్స్లు, 31 ఫోర్లతో 243 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కనిష్క్ 62, సోను 23 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గద్వాల 48.1 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులో తల్హ 37, గోపిచంద్ 34 పరుగులు చేశారు. మహబూబ్నగర్ బౌలర్లు యువన్ ముద్దనూరి 3, అభినవ్ 2, కనిష్క్ 2 వికెట్లు తీశారు.
అండర్–19 లీగ్లో
నైపుణ్యాన్ని చాటుకోవాలి
అండర్–19 ఇంట్రా డిస్ట్రిక్ట్ క్రికెట్ లీగ్లో క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకోవాలని ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్ అన్నారు. మహబూబ్నగర్–గద్వాల జట్ల మధ్య మ్యాచ్ను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా గెలుపొందిన మహబూబ్నగర్ జట్టును అభినందించారు. ఓడిన వారు గెలుపు కోసం పట్టుదలతో ఆడాలని పిలుపునిచ్చారు. అండర్–19 లీగ్ను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కోచ్ అబ్దుల్లా, సీనియర్ క్రీడాకారులు ముఖ్తార్, శ్రీనివాసులు, రంజిత్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అజేయ డబుల్ సెంచరీ చేసిన
అబ్దుల్ రాఫె