రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం

May 1 2025 1:28 AM | Updated on May 1 2025 1:28 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం

మాగనూర్‌(కృష్ణా): రోడ్డు ప్రమాదంలో ఓ బాలిక మృతిచెందిన ఘటన కృష్ణా మండలం గూడెబల్లూర్‌ గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఎస్‌ఐ నవీద్‌ వివరాల మేరకు.. ఊట్కూర్‌ మండలం మల్లెపల్లికి చెందిన లోకపల్లి వెంకటమ్మ రెండు రోజుల క్రితం తన ఇద్దరు కుమార్తెలు లోకపల్లి నందిని (16), మానసలతో కలిసి కర్ణాటక రాష్ట్రం కడేచూర్‌లోని బంధువుల ఇంట్లో జరిగిన మారెమ్మ పూజకు వెళ్లింది. బుధవారం అక్కడి నుంచి టైరోడ్డు వరకు బస్సులో చేరుకున్నారు. ఇక్కడి నుంచి మక్తల్‌కు చెందిన ప్యాసింజర్‌ ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. మార్గమధ్యంలోని గూడెబల్లూర్‌ శివారులో లోకపల్లి నందిని ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి జారి కిందపడింది. ఆటో వెనకే అతివేగంగా వస్తున్న కంటెయినర్‌ బాలికపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రైలు నుంచి పడి

వ్యక్తి మృతి

మదనాపురం: గుర్తు తెలియని రైలు నుంచి పడి వ్యక్తి మృతి చెందిన ఘటన మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ అశోక్‌ తెలిపిన వివరాలు.. మదనాపురం మండలం కొన్నూరు గ్రామ సమీపంలోని రైల్వేట్రాక్‌ పక్కన వ్యక్తి మృతి చెంది ఉన్నాడన్నా స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించినట్లు తెలిపారు. మృతుడి వయసు 45 ఏళ్ల ఉంటుందని, ఎరుపు రంగు టీషర్టు ధరించి ఉన్నట్లు, మృతుడికి సంబంధించి వివరాలు తెలియలేదన్నారు. మృతుడి ఆచూకీ తెలసిన వారు 87126 58598 సంప్రదించాలని పేర్కొన్నారు.

యువకుడి బలవన్మరణం

చారకొండ: ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ పోషణభారమై ఓ యువకుడు ఉరేసుకోని బలవన్మరణానికి పాల్పడిన ఘటన మండలంలోని సిర్సనగండ్లలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంషోద్దిన్‌ వివరాల ప్రకారం సిర్సనగండ్ల గ్రామానికి చెందిన జింకల లక్ష్మణ్‌(26) మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో భరించలేక బలవన్మరణానికి దారితీసిందని ఎస్‌ఐ పేర్కొన్నారు. మృతుడి తండ్రి సాలయ్య ఫిర్యాదు మేరకు బుధవారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

బైక్‌ను ఢీకొట్టిన బొలెరో

ఒకరి మృతి

హన్వాడ: మండలంలోని ఇబ్రహీంబాద్‌ సమీపంలో ఉన్న తాండూర్‌ ప్రధాన రహదారిపై బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఎస్‌ఐ వెంకటేశ్‌ వివరాల మేరకు.. దౌల్తాబాద్‌ మండలం యాంకీ గ్రామానికి చెందిన మౌలాల్‌ సాబ్‌ (60) ద్విచక్ర వాహనంపై మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా.. ఇబ్రహీంబాద్‌ సమీపంలో వెనక నుంచి వేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. చికి త్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడి కుమారుడి ఫిర్యాదు మేరకు బొలెరో వాహనం డ్రైవర్‌ రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో  బాలిక దుర్మరణం 
1
1/1

రోడ్డు ప్రమాదంలో బాలిక దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement