పత్తి విక్రయించి వస్తూ మృత్యుఒడికి.. | - | Sakshi
Sakshi News home page

పత్తి విక్రయించి వస్తూ మృత్యుఒడికి..

Dec 21 2025 12:38 PM | Updated on Dec 21 2025 12:38 PM

పత్తి విక్రయించి వస్తూ మృత్యుఒడికి..

పత్తి విక్రయించి వస్తూ మృత్యుఒడికి..

మహబూబాబాద్‌ రూరల్‌ : ఓ రైతు పత్తి పంట విక్రయించి వస్తూ మృత్యుఒడికి చేశాడు. టిప్పర్‌.. బొలెరోను ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన శుక్రవారం అర్ధరాత్రి మహబూబాబాద్‌ మున్సిపాలిటీ పరిధి జమాండ్లపల్లి గ్రామ శివారులో చోటుచేసుకుంది. మహబూబాబాద్‌ రూరల్‌ రెండో ఎస్సై రవికిరణ్‌ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా సింగరేణి (కారేపల్లి) మండలం గిద్దవారిగూడెం గ్రామానికి చెందిన కడారి ఉపేందర్‌ (55) పత్తి అమ్మడానికి ఈ నెల 18వ తేదీ( గురువారం) వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్లాడు. పత్తి విక్రయించిన అనంతరం తిరుగు ప్రయాణంలో వరంగల్‌ నుంచి నర్సంపేట మీదుగా బొలెరోలో ఇంటికి వస్తున్నాడు. ఈ క్ర మంలో మహబూబాబాద్‌ మున్సిపాలి టీ పరిధి జమాండ్లపల్లి శివారులో టిప్పర్‌ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వెనుకకు వచ్చింది. అంతలోనే బొలెరో నడుపుతున్న డ్రైవర్‌ నరేశ్‌ తన వాహనాన్ని అదుపు చేసేలోగా టిప్పర్‌ వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో బోల్తా పడి పక్కకు పడిపోగా ఉపేందర్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. డ్రైవర్‌ నరేశ్‌కు తీవ్ర గాయాలుకావడంతో అతడిని ఖమ్మంలో ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి భార్య మాణిక్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

బొలెరోను ఢీకొన్న టిప్పర్‌..

అక్కడికక్కడే రైతు మృతి

జమాండ్లపల్లి శివారులో ఘటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement