నూతన ఆవిష్కరణలు రూపొందించాలి | - | Sakshi
Sakshi News home page

నూతన ఆవిష్కరణలు రూపొందించాలి

Nov 27 2025 7:27 AM | Updated on Nov 27 2025 7:27 AM

నూతన ఆవిష్కరణలు రూపొందించాలి

నూతన ఆవిష్కరణలు రూపొందించాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: విద్యార్థులు నూతన ఆవిష్కరణలు రూపొందించాలని ఏసీజీఈ మందుల శ్రీరాములు అన్నారు. మానుకోట మున్సిపల్‌ పరిధి అనంతారం మోడల్‌ స్కూల్‌లో బుధవారం జిల్లా స్ధాయి ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫెయిర్‌ ప్రదర్శనలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏసీజీఈ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న నెపుణ్యాలను సైన్స్‌ఫెయిర్‌ ద్వారా వెలికితీయవచ్చన్నారు. జిల్లాస్థాయిలో విజేతలుగా నిలిచిన వారు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించాలని సూచించారు. మన జీవితం సైన్స్‌తో ముడిపడి ఉందని, ప్రతీ విషయంలో సైన్స్‌ దాగి ఉందన్నారు. రాష్ట్రస్థాయికి ఎంపికై న వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవార్డులు అందించారు. రాష్ట్రస్థాయికి 10 ఇన్‌స్పైర్‌ ప్రదర్శనలు, 14 సైన్స్‌ఫెయిర్‌ ప్రాజెక్టులు ఎంపికై నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్‌ అధికారి అప్పారావు, ఎంఈఓలు వెంకటేశ్వర్లు, రాందాస్‌, యాదగిరి, దేవేంద్రచారి, పాఠశాల ప్రిన్సిపాల్‌ ఉపేందర్‌రావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ముగిసిన జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌, సైన్స్‌ఫెయిర్‌ ప్రదర్శనలు

24 ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయికి ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement