● సాక్షి దినపత్రికపై ఏపీ ప్రభుత్వం
కక్షసాధింపు సరికాదు
● తక్షణమే కేసులను ఉపసంహరించుకోవాలి
● ప్రజాసంఘాల నాయకుల డిమాండ్
ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించాలి..
పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో వార్తలు ప్రచురించినప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తే న్యాయం పోరాటం చేయాలి. బెదిరింపులకు పాల్పడుతూ కేసులు పెట్టడం పత్రికా స్వేచ్ఛ హరించడమే. ఏపీ ప్రభుత్వ వైఖరిని ముక్తకంఠంతో ఖండించాలి. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.
– ఆడెపు రవీందర్, అధ్యక్షుడు
దేశాయిపేట రోడ్డు వర్తక సంఘం, వరంగల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాక్షి మీడియా గొంతునొక్కడం అప్రజాస్వామికమని పలు ప్రజాసంఘాల నాయకులు అన్నారు. సాక్షి దినపత్రికపై దాడులు చేస్తూ, ఎడిటర్, విలేకరులపై అక్రమ కేసులు పెట్టడం సరికాదని పేర్కొన్నారు. బెదిరింపులకు పాల్పడుతున్న సర్కారు వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం దుర్మార్గమని అన్నారు.
వేధింపులు మానుకోవాలి..
నెహ్రూసెంటర్: వాస్తవ కథనాలు ప్రచురించిన సాక్షి పత్రికపై, ఎడిటర్ ధనంజయరెడ్డిపై ఏపీ ప్రభుత్వం, పోలీసులు వేధింపులు మానుకోవాలి. ఏపీ ప్రభుత్వం, సీఎం చంద్రబాబు చెప్పినట్లు అక్కడి పోలీసులు వ్యవహరిస్తున్నారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తే చూస్తూ ఊరుకోం. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదు. సాక్షి పత్రికపై దాడులు, పత్రికా స్వేచ్ఛను హరించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు.
– గుగులోత్ భీమానాయక్,
ఎల్హెచ్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
అక్రమ కేసులు వెనక్కి తీసుకోవాలి
నెహ్రూసెంటర్: సాక్షి దినపత్రిక ఎడిటర్పై పెట్టిన అక్రమ కేసులు, నోటీసులను ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అక్రమ కేసులు పెట్టడాన్ని ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. వాస్తవ కథఽనాల ద్వారా అక్రమాలను వెలికితీస్తే కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం. పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఏపీ ప్రభుత్వానికి లేదు. ఇప్పటికై నా సాక్షిపై అక్రమంగా పెట్టిన కేసులు, నోటీసులను వెనక్కి తీసుకోవాలి.
–గుగ్గిళ్ల పీరయ్యమాదిగ, ఎమ్మార్పీఎస్ జాతీయ కార్యదర్శి
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం
మీడియా గొంతు నొక్కడం అప్రజాస్వామికం