
బాధ్యతలు స్వీకరించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ డైరక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఫైనాన్స్ డైరెక్టర్గా వంటెరు తిరుపతి రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్గా టి.మదుసూధన్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్గా వంగూరు మోహన్ రావు, హెచ్ఆర్డీ అండ్ ఐఆర్ డైరెక్టర్గా సి.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా.. సీఎండీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి కృషితో కంపెనీని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. సీఎండీ వరుణ్ రెడ్డి సారథ్యంలో కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని, వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డైరక్టర్లను అసోషియేషన్లు, యూనియన్ల నాయకులు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.