టీజీ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు | - | Sakshi
Sakshi News home page

టీజీ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు

Jun 28 2025 7:33 AM | Updated on Jun 28 2025 7:33 AM

టీజీ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు

టీజీ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు

హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్‌లో బదిలీలు, సర్దుబాట్లు జరిగాయి. ఈ మేరకు చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్‌ సీజీఎం వంటేరు తిరుపతి రెడ్డి డైరెక్టర్‌గా నియామకం కావడంతో ఖాళీ అయిన స్థానంలో సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ ఫైనాన్స్‌ మెంబర్‌గా కొనసాగుతున్న ఆర్‌.చరణ్‌దాస్‌ను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. సిరిసిల్ల సెస్‌కు ఫారిన్‌ డిప్యుటేషన్‌పై వెళ్లిన పి.విజేందర్‌ రెడ్డి అక్కడి నుంచి సెలవుపై వెళ్లి తిరిగి ఎన్పీడీసీఎల్‌లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఆయనను మహబూబాబాద్‌ ఎస్‌ఈగా నియమించారు. సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ బి.సుదర్శన్‌ను నిర్మల్‌ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. ఎస్‌ఈ వి.గంగాధర్‌ను మంచిర్యాల నుంచి పెద్దపల్లికి, జీఎం వి.వేణుమాదవ్‌ను కార్పొరేట్‌ ఆఫీస్‌ ప్రాజెక్ట్సు నుంచి జీఎం ప్లానింగ్‌కు బదిలీ చేశారు. కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఆపరేషన్‌ జనరల్‌ మేనేజర్‌గా కొనసాగుతున్న ఉత్తమ్‌.. మంచిర్యాల ఎస్‌ఈగా, జగిత్యాల ఎస్‌ఈ సాలియా నిర్మల్‌ ఎస్‌ఈగా బదిలీ అయ్యారు. తొర్రూరు డీఈ జి.మదుసూధన్‌ను మెట్‌పల్లికి, కార్పొరేటర్‌ ఆఫీస్‌ డీఈ జి.ఎల్‌.మర్రెడ్డిని అదే ఆఫీస్‌లో ప్రాజెక్టు విభాగానికి, డీఈ మహా బూబాద్‌ బి.పెద్దిరాజంను వరంగల్‌ డీపీఈ డీఈగా, పెద్దపల్లి ఎస్‌ఈ కార్యాలయంలో డీఈ టెక్నికల్‌ను తొర్రూరు డీఈగా, కార్పొరేట్‌ ఆఫీ స్‌లో ప్రాజెక్టు డీఈ డి.నందరాథోడ్‌ను ప్రాజెక్టు నుంచి ఇంజనీరింగ్‌ డీఈగా బదిలీ చేశారు. కాపులకనపర్తి ఏడీఈ నరసింహారావును కార్పొరేట్‌ ఆఫీస్‌ ప్రాజెక్టు విభాగానికి, ఏడీఈ బి.రవిని ప్రాజెక్టు నుంచి కాపుల కనపర్తికి, ఏడీఈ బి.శ్రీనివాస్‌ యాదవ్‌ను భూపాలపల్లి క్వాలిటీ కంట్రోల్‌ నుంచి కార్పొరేట్‌ ఆఫీస్‌కు, ఏడీఈ కె.పవన్‌ కుమార్‌ను కార్పొరేట్‌ ఆఫీస్‌ నుంచి హెచ్‌టీ మీటర్స్‌ వరంగల్‌ సర్కిల్‌కు బదిలీ జరిగింది. అకౌంట్స్‌ జనరల్‌ మేనేజర్‌ ఎన్‌.దేవేందర్‌కు సీజీఆర్‌ఎఫ్‌ వరంగల్‌ ఫైనాన్స్‌ మెంబర్‌గా స్థానం చలనం కలిగింది. రెవెన్యూ జీఎం ఆర్‌.కృష్ణ మోహన్‌ను ఫైనాన్స్‌ జీఎంగా, ఆడిట్‌ జీఎం ఎస్‌.సత్యనారాయణను రెవెన్యూ జీఎంగా, ఫైనాన్స్‌ జీఎం వి.వేణు బాబును ఆడిట్‌ జీఎంగా బదిలీ చేశారు.

కూరగాయల విత్తనాల పంపిణీ

మామునూరు: ఖిలావరంగల్‌ మండలం మా మునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్‌ కులాల ఉప ప్రణాళిక (ఎస్‌సీఎస్‌పీ) పథకాల ఆధ్వర్యంలో శుక్రవారం వర్ధన్నపేట మండలం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన 35 మంది మహిహిళా రైతులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి విజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్‌ రాజన్న హాజరై మాట్లాడారు. చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు మహిళలకు కలిగే శ్రమను తగ్గించి పొలాల్లో కలుపు నివారణ పనులు సు లభతరం చేస్తాయని తెలిపారు. కూరగాయల విత్తన కిట్లను ఇంటి ప్రాంగణంలో లేదా కంచె ల వెంట నాటడం ద్వారా ఆహార భద్రత మె రుగు పడి గ్రామీణ మహిళల జీవనోపాధి స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్‌ సా యి కిరణ్‌, డాక్టర్‌ గణేష్‌, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement