సంక్షిప్త సమాచారం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్త సమాచారం

Jun 26 2025 10:18 AM | Updated on Jun 26 2025 10:18 AM

సంక్ష

సంక్షిప్త సమాచారం

ఆలయ అభివృద్ధికి విరాళం

గార్ల: గార్లలోని ముత్యాలమ్మ ఆలయ అభివృద్ధికి దాత పతంగి సురేష్‌ ఆయన తల్లితండ్రులు దేవోజీ, సక్కుబాయిల జ్ఞాపకార్థం రూ.25వేలను ఆలయ నిర్వాహకులకు అందజేశారు. అదేవిధంగా బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గంగావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ తన సొంత ఖర్చులతో తాగునీటి కోసం బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు.

అభినందనీయం

మరిపెడ రూరల్‌: పేద విద్యార్థులకు దాతలు చేయూతనందించడం అభినందనీయమని బావోజిగూడెం యూపీఎస్‌ హెచ్‌ఎం గుగులోతు మంగు అన్నారు. బుధవారం పాఠశాల విద్యార్థులకు వందేమాతం ఫౌండేషన్‌ తొర్రూరు వారి సహకారంతో పలకలు పంపిణీ చేశారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు రవీందర్‌, ఉపాధ్యాయులు నవీత, లక్ష్మీనారాయణ, శ్రావణ్‌కుమార్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

పార్ట్‌ టైం ఉద్యోగులను రెన్యువల్‌ చేయాలి

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకులాల్లో పనిచేస్తున్న తమను రెన్యువల్‌ చేయాలని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పార్ట్‌ టైం ఉద్యోగుల సంఘం బాధ్యులు ఈశ్వరయ్య, ఉప్పలయ్య, మల్లయ్య బుధవారం హైదరాబాదులో కలిసి వినతిపత్రం అందజేశారు.

రోడ్డు వెడల్పు తగ్గించాలి

కేసముద్రం: మున్సిపాలిటీ పరిధిలో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులను 100 పీట్లు కాకుండా, 60 ఫీట్ల వెడల్పు వరకే రోడ్డును ఏర్పాటు చేయాలంటూ బుధవారం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో వోలం శ్రీనివాస్‌, శ్రీనివాసరావు, గుణగంటి అశోక్‌, యాదగిరి పాల్గొన్నారు.

విద్యా సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలి

దంతాలపల్లి: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో హెచ్‌ఎంలు ముందుండాలని ఎంఈఓ శ్రీదేవి అన్నారు. మండలకేంద్రంలో గల జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాలలో బుధవారం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. విద్యా సామర్థ్యాల పెంపునకు ఉపాధ్యాయులు ప్రణాళికతో కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు వేణుమాధవరెడ్డి, కృష్ణయ్య పాల్గొన్నారు.

ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకోవాలి

దంతాలపల్లి: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటిని త్వరగా పూర్తి చేసుకోవాలని ఎంపీడీఓ వివేక్‌రామ్‌ అన్నారు. మండలంలోని కుమ్మరికుంట్ల, బొడ్లాడ గ్రామాలలో బుధవారం ఆయన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. త్వరగా ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటే ప్రభుత్వం బిల్లులు ఇస్తుందన్నారు.

ఇందిరమ్మ ఇంటి పత్రాల పంపిణీ

కురవి: మండలంలోని రాజోలు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు బుధవారం ఇళ్ల పట్టాలను కాంగ్రెస్‌ డోర్నకల్‌ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ బండి శ్రీనివాస్‌ గౌడ్‌ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి మంజుల, నాయకులు అంబటి గోవర్ధన్‌ గౌడ్‌, అంబటి అనూష విష్ణువర్ధన్‌ గౌడ్‌, కొక్కు శ్రీనివాస్‌, మేకల గంగాధర్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

సమ్మె నోటీస్‌ అందజేత

గూడూరు/గార్ల: కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు, లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ జూలై 9న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సీఐటీయూ నాయకుడు ఎండి. మోహినోద్దిన్‌ అన్నారు. బుధవారం ఎంపీడీఓ వీరస్వామికి సమ్మె నోటీస్‌ అందించారు.

కాంగ్రెస్‌వి మోసపూరిత హామీలు

చిన్నగూడూరు: కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు మోసపూరిత హామీలు ఇచ్చి రైతు పేరిట సంబురాలు జరుపుకోవడం విడ్డూరమని సేవాలాల్‌ సేన మండల ఇన్‌చార్జ్‌ బాదావత్‌ సురేష్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

శాంతిచర్చలు జరపాలి

బయ్యారం: మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతిచర్చలు జరపాలని సీపీఎం జిల్లా నాయకుడు మండా రాజన్న డిమాండ్‌ చేశారు. బుధవారం బయ్యారంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు మధు, నాగేశ్వరరావు, వెంకన్న, తిరుపతిరావు, పురుషోత్తం పాల్గొన్నారు.

సౌండ్‌ సిస్టం బహూకరణ

డోర్నకల్‌: స్థానిక మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలకు ప్రముఖ వ్యాపారి సురేందర్‌ జైన్‌ సౌండ్‌ సిస్టంను బుధవారం బహూకరించాడు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రిజ్వూనా, జ్యోత్స్న, రేచెల్‌, అనూష, రమ, దీప్తి పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం..

తొర్రూరు రూరల్‌: కాంగ్రెస్‌ బలోపెతం కోసం నిరంతరం పని చేస్తూ, ఆపదలో ఉన్న కార్యకర్తలకు అండగా ఉంటామని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షురాలు హనుమాండ్ల ఝూన్సీరెడ్డి హమీ ఇచ్చారు. బుధవారం మండలంలోని తొర్రూరు, అమ్మాపురం, గుర్తూరు గ్రామాల్లో పలు బాధిత కుటుంబాలకు ఆర్థికసాయం చేశారు.

పాఠశాల తనిఖీ

కేసముద్రం: మండలంలోని అన్నారం యూపీఎస్‌, ధర్మారంతండా, తాళ్లపూసపల్లి ప్రాథమిక పాఠశాలలను ఎంఈఓ కాలేరు యాదగిరి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎంలు బత్తుల శ్రీధర్‌, నాగనబోయిన వెంకటేశ్వర్లు, బాణాల ప్రమీల, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సీజనల్‌ వ్యాధులను అరికట్టాలి

గార్ల: గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులను అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు కార్యదర్శులకు బుధవారం వినతిపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గంగావత్‌ లక్ష్మణ్‌నాయక్‌, శీలంశెట్టి రమేష్‌, గాజుల గణేష్‌, ధరావత్‌ సక్రు పాల్గొన్నారు.

సంక్షిప్త సమాచారం1
1/1

సంక్షిప్త సమాచారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement