
పేదల ఐక్యతను దెబ్బతీస్తున్న కులవ్యవస్థ
నెహ్రూసెంటర్: సమాజంలో పేదల ఐక్యతను దెబ్బతీసే విధంగా కుల వ్యవస్థ తీవ్రంగా పని చేస్తుందని, సమాజంలో అంటరాని తనం, కుల వ్యవస్థతకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తప్పెట్ల స్కైలాబ్బాబు అన్నారు. సంఘం జిల్లాస్థాయి శిక్షణ తరగతులు జిల్లా కేంద్రంలో బుధవారం ప్రారంభమయ్యాయి. ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ కార్పొరేషన్, సబ్ప్లాన్ అమలు చేసి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని, సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు సౌకర్యాలు కల్పించాలని సంఘం పోరాటాలు నిర్వహిస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, చీపిరి యాకయ్య, దుడ్డెల రామ్మూర్తి, చింత ఎల్లయ్య, జిన్న లచ్చయ్య, మందుల యాకుబ్, నిదిగొండ చంటి పాల్గొన్నారు.