
మొండి బకాయిలు వసూలు చేయాలి
మరిపెడ రూరల్: మరిపెడ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోని షాపుంగ్ కాంప్లెక్స్ లక్షల రూపాయల మొండి బకాయిలను తక్షణ వసూలు చేయాలని సీపీఐ మండల కార్యదర్శి బాలకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. కాంప్లెక్స్లో 20 షాపులు యజమానులు నెలల తరబడి కిరాయిలు చెల్లించడం లేదన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతుందని మండిపడ్డారు. సమయానికి కిరాయిలు చెల్లించని షాపులకు తక్షణమే నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించాని ఎంపీడీఓను కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఎండీ అబ్దుల్ రషీద్, పట్టణ కార్యదర్శి మల్లెపాక యాకన్న, సత్తెయ్య తదితరులు పాల్గొన్నారు.