
ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు
నెహ్రూసెంటర్: ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక ప్రభుత్వ విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ జిల్లా కార్యదర్శి పాయం చిన్న చంద్రన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన సంస్కరణలతో కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి డీవీ కృష్ణ వర్ధంతి సభలను నేటి నుంచి 29వ తేదీ వరకు గ్రామగ్రామాన నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి, నాయకులు పూనెం ప్రభాకర్, ముంజంపల్లి వీరన్న, బిల్లకంటి సూర్యం, ఉమ్మగాని సత్యం, తదితరులు పాల్గొన్నారు.