
మద్యం, గుట్కా ప్యాకెట్ల స్వాధీనం
బయ్యారం: మండలంలోని రామచంద్రాపురం(రామగుండాల)లో బుధవారం ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. బెల్ట్షాపుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 7వేల విలువైన మద్యం, 5వేల విలువైన గుట్కా, 10లీటర్ల గుడుంబా, 500లీటర్ల బెల్లంపానకంను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం గ్రామస్తులకు ట్రాఫిక్రూల్స్, సైబర్క్రైం గురించి ఎస్సై అవగాహన కల్పించారు. ఇదేవిధంగా సరైన అనుమతి పత్రాలు లేని 20వాహనాలను సీజ్ చేయడంతోపాటు గుడుంబా, గుట్కాలు విక్రయిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్సై పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.