
తూకంలో తేడాలు వస్తే చర్యలు
తొర్రూరు: తూకం, కొలతల్లో తేడా వస్తే చర్యలు తీసుకుంటామని తూనికలు, కొలతల శాఖ జిల్లా అధికారి విజయ్కుమార్ తెలిపారు. డివిజన్ కేంద్రంలోని ఎరువుల దుకాణాలు, కిరాణా దుకా ణాల్లో మంగళవారం తనిఖీ చేపట్టారు. పలువురికి నోటీసులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాక్ చేసిన విత్తనాలు, ఎరువులు, నిత్యావసర సరుకుల తూకం తక్కువ ఉందని అనుమానం వస్తే వ్యాపారి వద్ద ఉన్న కాంటా రాళ్లతో సరి చూసుకోవాలన్నారు. నిరంతరం అన్ని రకాల వ్యాపారాల విక్రయ కేంద్రాలపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీసీఐసీ చైర్మన్ వింజమూరి సుధాకర్, సిబ్బంది పాల్గొన్నారు.