
సివిల్స్లో ఉచిత శిక్షణ దరఖాస్తుల కరపత్రం ఆవిష్కరణ
కేయూ క్యాంపస్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేద విద్యార్థులకు సివిల్స్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్న నేపథ్యంలో ఆ శిక్షణకు సంబంధించిన దరఖాస్తుల ఆహ్వాన కరపత్రాలను కాకతీయ యూనివర్సిటీలో వీసీ కె. ప్రతాప్రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం మంగళవారం ఆవిష్కరించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్ రోడ్ నంబర్14 కేబీఆర్ పార్క్ ఎదుట ఉన్న షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో 2025–2026 విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించే సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు ఆన్లైన్లో జూలై 7వరకు దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికై న వారికి ఎస్సీ స్టడీ సర్కిల్లో ప్రవేశం కల్పించి ఉచిత భోజనంతోపాటు శిక్షణ ఇస్తారు. ఈ కరపత్రం ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిలా శాఖ డైరెక్టర్ జగన్మోహన్, కేయూ హాస్టళ్ల డైరెక్టర్ ఎల్పి. రాజ్కుమార్,అంబేడ్కర్ స్టడీసెంటర్ డైరెక్టర్ సిహెచ్. రాజ్కుమార్, డాక్టర్ సూరాసి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.