
ఎట్టకేలకు డైరెక్టర్ల నియామకం..
హన్మకొండ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు రాష్ట్రంలోని డిస్కంలకు డైరెక్టర్ పోస్టులను నియమించింది. ఇందులో భాగంగా నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(టీజీఎన్పీడీసీఎల్)కు నలుగురిని నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభు త్వ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రా గానే అప్పటి వరకు ఉన్న టీజీ ఎన్పీడీసీఎల్ పాలక మండలిని తొలగించింది. 2024 జనవరి 29న కొత్త పాలక మండలి నియామకంలో భాగంగా డైరెక్టర్ పోస్టుల నియామకానికి 2024 జనవరి 30న నోటిఫికేషన్కు జారీ చేసింది. అప్పటికే ఐఏఎస్ అధికారి కర్నాటి వరుణ్ రెడ్డిని చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గా నియమించింది. అప్పటి వరకు సీనియర్ సీజీఎంలను ఇన్చార్జ్ డైరెక్టర్లుగా నియమించగా వారు ఈ పదవుల్లో కొనసాగుతూ వస్తున్నారు. దీంతో 18 నెలలుగా డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ క్రమంలో ఎట్టకేలకు డైరెక్టర్ పోస్టులను భర్తీ చేసింది. కాగా, వంటేరు తిరుపతి రెడ్డి (ఫైనాన్స్), టి.మధుసూదన్ (ఆపరేషన్స్), వంగూరు మోహన్ రావు (ప్రాజెక్ట్స్), సి.ప్రభాకర్ (హెచ్ఆర్డీ–ఐఆర్)ను డైరెక్టర్లగా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఇద్దరు బీసీలు, ఓసీ, ఎస్సీ ఒక్కొక్కరున్నారు. ఈ నెల 27న కొత్త డైరెక్టర్లు బాధ్యతలు స్వీకరించనున్నారు.
17 జిల్లాల పరిధిలో విస్తరణ..
రాష్ట్రంలో మొత్తం 33 జిల్లాలుండగా టీజీ ఎన్పీడీసీఎల్ 17 జిల్లాలు, 299 మండలాల్లో విస్తరించి ఉంది. 5,580 గ్రామాలు, 7,474 హామ్లేట్లకు విద్యుత్ పంపిణీ చేస్తుంది. 68,62,858 విద్యుత్ సర్వీస్లున్నాయి. 9 వేలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. 2024 జనవరి 30న నాలుగు డైరెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం.. 2024 మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించింది. దాదాపు 83 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇందులో టీజీ ఎన్పీడీసీఎల్లో సీజీఎంలుగా పని చేస్తున్న వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఇద్దరికి మాత్రమే అవకాశం లభించింది. ఇదే కంపెనీలో సీజీఎం (సీఈ)లుగా పని చేసి రిటైర్డ్ అయిన ఇద్దరికి డైరెక్టర్లుగా అవకాశం లభించింది. ప్రస్తుతం సీజీఎంలు, చీఫ్ ఇంజనీర్లుగా కొనసాగుతున్న వంటేరు తిరుపతి రెడ్డి, టి.మధుసూదన్, సదర్లాల్, అశోక్ కుమార్, రాజు చౌహాన్ డైరెక్టర్ పదవి కోసం దరఖాస్తు చేసుకోగా ఇందులో వంటేరు తిరుపతి రెడ్డికి ఫైనాన్స్ డైరెక్టర్గా, టి.మధుసూదన్ను ఆపరేషన్ డైరెక్టర్గా నియమించింది. అదే విధంగా హెచ్ఆర్డీ సీజీఎంగా రిటైర్డ్ అయిన సి.ప్రభాకర్ను హెచ్ఆర్డీ–ఐఆర్ డైరెక్టర్గా, ప్రాజెక్టు సీజీఎంగా ఇన్చార్జ్ డైరెక్టర్గా కొనసాగుతూ రిటైర్డ్ అయిన వంగూరు మోహన్ రావును ప్రాజెక్టు డైరెక్టర్గా నియమించింది. కాగా, డైరెక్టర్ పదవిని ఆశించిన సదర్లాల్, అశోక్ కుమార్, రాజు చౌహాన్కు నిరాశే మిగిలింది. ఇందులో సదర్ లాల్, అశోక్కుమార్, ఇన్చార్జ్ డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. ఇక నుంచి వీరు సీజీఎంలుగా మాత్రమే కొనసాగనున్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్లో 18 నెలల తర్వాత పోస్టుల భర్తీ..
డైరెక్టర్లుగా నలుగురు నియామకం
ఇందులో ఇద్దరు ప్రస్తుత ఇన్చార్జ్
డైరెక్టర్లు.. మరో ఇద్దరు రిటైర్డ్ చీఫ్
ఇంజనీర్లు
సీజీఎంలు, రిటైర్డ్ సీజీఎంలు దరఖాస్తులు..
డైరెక్టర్ పోస్టుల కోసం జెన్కో, ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్లో పని చేస్తున్న సీజీఎంలు, రిటైర్డ్ సీజీఎంలు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు పెద్ద ఎత్తున రావడంతో తీవ్ర పోటీ నెలకొంది. ఈ క్రమంలో దరఖాస్తులదారులపై ఇంటెలిజెన్స్ అధికారులు సుదీర్ఘంగా అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ప్రభుత్వం ఈ నివేదికను పరిశీలించి నియామకాలు చేపట్టినట్లు తెలిసింది.

ఎట్టకేలకు డైరెక్టర్ల నియామకం..

ఎట్టకేలకు డైరెక్టర్ల నియామకం..

ఎట్టకేలకు డైరెక్టర్ల నియామకం..