కాజీపేట రూరల్ : ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాజీపేట జంక్షన్ మీదుగా ప్ర త్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ మంగళవారం తెలిపారు.
ప్రత్యేక రైళ్ల వివరాలు..
జూన్ 26 నుంచి జూలై 31వ తేదీ వరకు సుబేదార్గంజ్–చర్లపల్లి (04121) ఎక్స్ప్రెస్ ప్రతీ శుక్రవారం కాజీపేటకు 18.00 గంటలకు చేరుతుంది. జూన్ 28 నుంచి ఆగస్టు 2వ తేదీ వరకు చర్లపల్లి–సుబేదార్గంజ్ (04122) ఎక్స్ప్రెస్ ప్రతీ శనివారం 6.30 గంటలకు కాజీపేటకు చేరుతుంది. ఈ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే పరిధి నాగ్పూర్, బల్లార్షా, సిర్పూర్కాగజ్నగర్, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట స్టేషన్లలో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ కల్పించారు. జూన్ 26 నుంచి జూలై 2వ తేదీ వరకు యశ్వంత్పూర్–యోగ్నగరి రిషికేశ్ (06597) ఎక్స్ప్రెస్ ప్రతీ శనివారం కాజీపేటకు చేరుతుంది. జూన్ 28 నుంచి జూలై 5వ తేదీ వరకు యోగ్నగరి రిషికేశ్–యశ్వంత్పూర్ (08598) ఎక్స్ప్రెస్ ప్రతీ మంగళవారం కాజీపేటకు చేరుతుంది. ఈ రైళ్లకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎలహంకా, హిందుపురం, ధర్మవరం, అనంతపురం, డోన్, కర్నూల్ సిటీ, కాచిగూడ, కాజీపేట, బల్లార్షా, నాగ్పూర్లో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ కల్పించారు.
కేయూలో సేంద్రియ పద్ధతిలో మల్బరీ సాగు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో సెరికల్చర్ విభాగం ఆధ్వర్యంలో సేంద్రియ పద్ధతిలో మల్బరీ సాగు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అభివృద్ధి చేసిన రెండున్నర ఎకరాల్లో సాగు చేయిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఈ సాగుపై ప్రాక్టికల్ శిక్షణ పొందుతున్నారు. సేంద్రియ ఎరువుతో మల్బ రీ ఆకులు దిగుబడి పెంపుతోపాటు నేల, తేమ నిలుపుదల, పోషకాల లభ్యత మెరుగు పరుస్తున్నామని కేయూ సెరికల్చర్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు కె. సుజాత, కనీజ్ఫాతిమా మంగళవారం తెలిపారు.
ఈ క్షేత్రంలో విద్యార్థులకు నేరుగా వ్యవసాయ అనుభవాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం రెండున్నర ఎకరాల్లో మల్బరీ వనరులతోపాటు టస్సర్ సిల్క్ వార్మ్ కోసం అవసరమైన ఫుడ్ ప్లాంట్లు పెంచుతున్నారు. ఇందులో 7 నుంచి 8 రకాల మల్బరీ రకాలున్నాయి. 2010లో యూజీసీ మేజర్ రీసెర్చ్ ప్రాజెక్టు నిధులతో ఈఫీల్డ్ అభివృద్ధి చేశారు. కాగా, కాకతీయ యూనివర్సిటీ సెరికల్చర్ రీసెర్చ్ యూనిట్స్, ఎమ్మెస్సీ సెరికల్చర్ కోర్సు అందిస్తోంది.

కాజీపేట జంక్షన్ మీదుగా ప్రత్యేక రైళ్లు