
బైలాకు విరుద్ధంగా ఎంపికై న కమిటీ చెల్లదు
హన్మకొండ: బైలాకు విరుద్ధంగా ఎలాంటి ఎన్నికల నోటిఫికేషన్ లేకుండా కమిటీని ఎంపిక చేశారని, ఇది చెల్లదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ టీజీ ఎన్పీడీసీఎల్ కంపెనీ కార్యదర్శి బక్క దానయ్య, ఇతర నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం హనుమకొండ బాలసముద్రంలో అసోసియేషన్ ఎన్పీడీసీఎల్ శాఖ ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ అసోసియేషన్లోనైనా ఎన్నికలు నిర్వహించడానికి ముందు పాత కమిటీలను రద్దు చేసి కొత్త కమిటీలు ఎన్నుకుంటారన్నారు. ఈ పద్ధతిలో ఎన్నికై న కమిటీని మాత్రమే సంబంధిత అధికారులకు పరిచయం చేస్తారన్నారు. అయితే అసోసియేషన్ నుంచి బహిష్కరణకు గురైన మాతంగి శ్రీనివాస్ అనే వ్యక్తి మాత్రం బైలాకు వ్యతిరేకంగా ఎన్పీడీసీఎల్ శాఖ నూతన కమిటీని ఏర్పాటు చేసినట్లు సీఎండీకి పరిచయం చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఈ కమిటీ చెల్లదని స్పష్టం చేశారు. ఈ కమిటీని అధికారులు పరిగణనలోకి తీసుకోవద్దని వారు కోరారు.
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతల స్పష్టీకరణ