
మాదకద్రవ్యాలతో అనర్థాలు
మహబూబాబాద్ రూరల్ : మాదకద్రవ్యాలు మన జీవితాలను నాశనం చేస్తాయని, యువత మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. యాంటీ నార్కొటిక్స్ వారోత్సవాల్లో భాగంగా యాంటీడ్రగ్స్ పోస్టర్లను జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులు కలిసికట్టుగా ముందడుగు వేయాలని కోరారు. గంజాయిలాంటి మత్తుపదార్థాలకు సంబంధించిన సమాచారాన్ని తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్ బ్యూరో నంబర్ 87126 71111కి లేదా డయల్ 100 లేదా తమ పరిధిలో ఉన్న పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు. ఏఆర్ డీఎస్పీ శ్రీనివాస్, ఎస్బీ సీఐ చంద్రమౌళి, ఐటీ కోర్ సీఐ నరేందర్, డీసీఆర్బీ సీఐ సత్యనారాయణ, ఆర్ఐలు అనిల్, భాస్కర్, నాగేశ్వర్ రావు, సోములు పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్