
‘బెస్ట్ అవైలబుల్’ బకాయిలు చెల్లించాలి
తొర్రూరు: బెస్ట్ అవైలబుల్ పథకం కింద తమ పిల్లలు చదువుతున్న ప్రైవేట్ పాఠశాలలకు బకాయిలు చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ పథకం కింద విద్యార్థులకు విద్యనందిస్తున్న డివిజన్ కేంద్రంలోని లిటిల్ఫ్లవర్ హైస్కూ ల్ ఎదుట సోమవారం విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుంచి బిల్లులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజ మాన్యాలు భోజనం, వసతి, విద్య అందించడం కష్టంగా మారిందని తల్లిదండ్రులు వాపోయారు. ఎస్సీ, ఎస్టీ పిల్లలు చదివే పాఠశాలలకు బకాయిలు చెల్లించకపోవడం సరికాదన్నారు. ఈ విషయమై పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్రెడ్డి వివరణ కోరగా.. గురుకులాల్లో చదివే ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షల మేర ఖర్చు చేస్తుందని, బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థికి కేవల రూ.40 వేలు ఖర్చు చేస్తుందన్నారు. దానికి అంగీకరించి నాణ్యమైన విద్య, భోజ నం, వసతి అందిస్తున్న పాఠశాలలకు బకాయిలు చెల్లించకపోవడం ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయమై గతంలో పలు పర్యాయాలు ప్రభుత్వ పెద్దలను కలిసినా ఫలితం లేకపోయిందన్నారు.