
విద్యారంగానికి అధిక ప్రాధాన్యం
మహబూబాబాద్ రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుందని డీఈఓ రవీందర్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి ఎంపీపీఎస్ అభివృద్ధికి సోమవారం తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా అధ్యక్షుడు కోలిశెట్టి సత్యనారాయణ, ఉమ దంపతులు రూ.20 వేలు విరాళంగా అందజేశారు. అదే విధంగా వారి కుమార్తె భవిష్య పటేల్ను ప్రభుత్వ బడిలో నాలుగో తరగతిలో చేర్పించగా.. డీఈఓ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో డీపీఆర్ఓ రాజేంద్రప్రసాద్, బీసీ సంక్షేమ అధికారి నరసింహారావు, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం లక్ష్మి, జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ పూర్ణ చందర్, స్పూర్తి ఫౌండేషన్ కన్వీనర్ శ్రీధర్ రెడ్డి, టీపీటీఎఫ్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాస్, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆవునూరి రవి, రాధిక, సువర్ణ, శ్రీజ, గ్రామ ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.