
ప్రైవేట్ బడులకు పంపకండి
మహబూబాబాద్ రూరల్ : తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ బడులకు పంపవద్దని పర్వతగిరి జెడ్పీ, ఎంపీపీఎస్ పాఠశాలల హెచ్ఎంలు మందుల శ్రీరాములు, పంజాల లింగమూర్తి కోరారు. బడిబాటలో భాగంగా మహబూబాబాద్ మండలంలోని పర్వతగిరి గ్రామస్తులు, యువకులు పిల్లలను స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ప్రైవేట్ పాఠశాల బస్సు ఎక్కిస్తున్న మునీందర్ కుమార్తె 3వ తరగతి విద్యార్థిని రిక్తికను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవి, గీత, రామాచారి, హరి, రాధిక, గ్రామస్తులు చల్ల వెంకన్న, అశోక్, నవీన, సలీం, సాయి, మహేశ్, నారాయణ సింగ్, అబ్రహం, మధు, సంపత్, నరేశ్, రాజు, రంజిత్, రామన్న, కిరణ్, వేణు, అనిల్ యాకన్న తదితరులు పాల్గొన్నారు.